Tuesday 24 April 2012

ఆమె వల్ల 'దమ్ము' కి ఐదు కోట్లు లాస్

ఎన్టీఆర్ తాజా చిత్రం దమ్ములో శృతిహాసన్ మొదట్లో హీరోయిన్ గా చేసిన సంగతి తెలిసిందే. అయితే కొంత షూటింగ్ అయిన తర్వాత ఆమె డేట్స్ ఎడ్జెస్ట్ చేయలేనని ప్రాజెక్టు నుంచి తప్పుకుంది. ఆమె అప్పట్లో పది రోజులకు పైగానే షూటింగ్ లో పాల్గొంది. .అయితే షూటింగ్ ని ఊసరవెల్లికి బ్రేక్ ఇచ్చి ప్రారంభించటంతో ఆమె సారి చెప్పి బై చెప్పి వెళ్లిపోయింది.. ఆమె తనకు డేట్స్ లేకపోవటంతో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు నుండి తప్పుకున్నట్లు చెప్తున్నారు. అయితే ఆమె వాలంటరిగా టీమ్ కి గుడ్ లక్ చెప్పి బయిటకు వెళ్లటంతో ఈ మ్యాటర్ ఇష్యా కాలేదు. కానీ ఆమె చేసినప్పుడు షూట్ చేసిన పది రోజులకు,ఆమె రెమ్యునేషన్ తో కలిపి ఐదుకోట్ల రూపాయల వరకూ లాస్ వచ్చిందని సమాచారం. ఇప్పుడదే ఫిల్మ్ సర్కిల్స్ లో మాట్లాడుకుంటున్నారు.

ఇక అప్పుడు ఎన్టీఆర్ ఈ చిత్రం గురించి మొదటి నుంచీ...ఆ చిత్రం ఫ్యాన్స్ కి విందు భోజనంలా ఉంటుందని అని పని గట్టుకుని మరీ చెప్తున్నారు. అలాగే తాను లావు తగ్గి చేసే డాన్స్ లు హైలెట్ గా ఉంటాయని నొక్కి మరీ చెపున్నారు. భవిష్యత్ లో తాను లావు గా కనపడనని, గతంలో కనపించినంత లావుగా కానని,తగ్గిపోతానని,ఆ విషయం దమ్ము చిత్రం లో గమనించవచ్చునని ఎన్టీఆర్ తన అభిమానులకు హామీ ఇచ్చారు. అలాగే జూ. ఎన్టీఆర్ ఇక తన దృష్టినంతా తాజా చిత్రం 'దమ్ము"పై కేంద్రీకరించి చేసాడని టాక్. బోయపాటి శ్రీను దర్శకత్వంలో క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై కె.యస్.రామారావు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ నెల 27 న ఈ చిత్రం విడుదల అవుతోంది. 

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...